Friday, November 10, 2023

తెలంగాణ ఎన్నికలు: పార్టీల వారీ అభ్యర్ధులు వీరే

 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg1kZhlhq2Fy28ZhCpr5kbxBjCfqWavCbUrc9W3r3pflZaovZJd8wwWyrGKKkEKVSPevFAcU2-isEXsiReRBVo5frpSQp0JGOKi1jRr9wWElLXFoeWaTEqSjsWqUg06h74YHW629pP9XMOKag3bu_42AluFPS53lJ-S-GjcOAwA0A-vB6siCaj1Urc7_zdW/s16000/Final.jpg

Sunday, October 29, 2023

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి తెదేపా దూరం

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెదేపా నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. శనివారం ములాఖత్‌ సందర్భంగా రాజమహేంద్రవరం జైలులో ఆయన్ను తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కలిశారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు చెప్పారు. ఏ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో తెలంగాణ నేతలకు వివరించాలని కాసానికి ఆయన సూచించారు. చంద్రబాబు నిర్ణయాన్ని తెలంగాణ నేతలకు ఆ పార్టీ సీనియర్‌ నేతలు వివరిస్తున్నారు.

Friday, September 8, 2023

సూర్యదేవర రామమోహన రావు నవల్స్ అన్నీ .. లింక్స్

 సూర్యదేవర రామమోహన రావు నవల్స్ అన్నీ ఈ లింకులో ఉన్నాయి.. కాలక్షేపం కోసం చదవాలంటే క్రింద లింక్ నుండి వెళ్ళొచ్చు .

 

ఇక్కడ క్లిక్ చేయండి

Sunday, May 28, 2023

Google Translate Vs CHATGPT: ఏది గొప్ప ???

ఈరోజు గూగుల్ మరియు చాట్ GPT లో ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అనువాదం చేస్తే ఎలావచ్చిందో చూడండి. 

 

Original: 

Prime Minister Narendra Modi today inaugurated the new parliament building and installed a historic sceptre ‘Sengol' near the Lok Sabha Speaker's chair. Speaking at the building for the first time, the PM said that the new Parliament is a temple of democracy. A puja and a multi-faith prayer were held on the occasion. He also unveiled a commemorative plaque for the new building. Lok Sabha Speaker Om Birla and Adheenam seers were present at the event. The seers handed over the ‘Sengol' to PM Modi who walked into the new Parliament building and installed it.

 

 Google: 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి, లోక్‌సభ స్పీకర్ కుర్చీకి సమీపంలో చారిత్రాత్మకమైన ‘సెంగోల్’ అనే రాజదండాన్ని ఏర్పాటు చేశారు. ఈ భవనంలో తొలిసారిగా మాట్లాడిన ప్రధాని, కొత్త పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయమని అన్నారు. ఈ సందర్భంగా పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నూతన భవనానికి సంబంధించిన స్మారక ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, అధినాయకులు పాల్గొన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లి దానిని అమర్చిన ప్రధాని మోదీకి సీర్లు ‘సెంగోల్’ను అందజేశారు.

 

Chat GPT

ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు మరియు లోకసభ స్పీకర్ చైర్ సమీపంలో ఐతిహాసిక సెప్టర్ "సెంగోల్" అనే ఒక ఆవిష్కరణ చేసారు. ప్రధానికి అభిమతం ఇచ్చినట్లుగా ప్రధానమంత్రి తెలిపినట్లుగా ప్రారంభించినారు దేశానికి ఇది ఒక పూజా స్థలం అని. ఈ సందర్భంలో పూజా మరియు బహుమతి ప్రార్థన నిర్వహించబడింది. అలాగే, కొత్త భవనాన్ని గుర్తించే ఒక స్మారక వృక్షం అన్వేషించారు. లోకసభ స్పీకర్ ఓం బిర్లా మరియు అధీనం సీర్స్ ఈ ఈవెంట్లో ఉంది.

 




Sunday, August 21, 2022

నెగెటివ్ వార్తలు రాయడం ఎలా??? "ఈనాడు" కోచింగ్

ఒకసారి ఈ క్రింది వార్త చూడండి... ఇది ఈరోజు ఈనాడు పేపర్ లో వచ్చింది 

 

 
పైన వార్త చూడగానే అయ్యో ఇండియా లో విమానాశ్రయాలన్నీ లాభాల్లో ఉంటె ఇలా ఎపి లో నష్టాల్లో ఉన్నాయా అని బాధ వేస్తుంది... 

పొతే 
 
ఈ వార్తని జాగ్రత్తగా చదివితే ... దేశంలో ఉన్న 109 విమానాశ్రయాలలో 9 మాత్రమె లాభాల్లో ఉండగా వాటిలో విశాఖపట్నం కూడా ఉందట... ఇది ఎంత మంచి వార్త!!!
 
ఇలా మంచి వార్తల్ని కూడా చెడు వార్తల లాగా చిత్రీకరించడం "ఈనాడు" కే చెల్లింది. అదీ కేవలం మూడొందల పదాల లోపు ఉన్న వార్తని కూడా కన్ఫ్యూజ్ చేసి మభ్య పెట్టె ప్రయత్నం చెయ్యడం చాలా గొప్ప విషయం 


రామోజీ!! నువ్వు అసాధ్యుదవయ్యా ..
 
 




 

Monday, December 14, 2020

రెండోసారి కరోనా నుంచి కోలుకున్న అంబటి రాంబాబు

Ambati Rambabu discharged from hospital వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇటీవల రెండోసారి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే, తాను కరోనా నుంచి కోలుకున్నానని అంబటి రాంబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా పాటించి హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స ముగించుకుని ఇవాళ గుంటూరు వచ్చానని వివరించారు. రెండోసారి ఇన్ఫెక్షన్ రావడం కొంత ఆందోళన కలిగించినా, మీ ఆశీస్సులతో విజయవంతంగా ఎదుర్కోగలిగానని తెలిపారు. త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ ఉత్సాహం వ్యక్తం చేశారు.