Monday, March 26, 2012

నేడు ‘పండితారాధ్యుల’ శతజయంతి!




పాత్రికేయులంటే ఎలా ఉండాలో పండితారాధ్యుల నాగేశ్వరరావును చూసి నేర్చుకోవాల్సిందే నని తలపండిన పాత్రికేయులు సైతం అంగీ కరిస్తారన్నది అతిశయోక్తి కాదు. గుంటూరు జిల్లా, ఇంటూరు గ్రామంలో 1912 మార్చి 26న జన్మిం చిన పండితారాధ్యుల నాగేశ్వరరావు, గుంటూ రు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం అనంతరం పత్రికారచయితగా ప్రసిద్ధిగాంచారు. పిఠాపురం మహా రాజావారి ‘దేశబంధు’ పత్రికలో కొన్నాళ్లు పనిచేసి, ఆచార్యరంగా నెలకొల్పిన ‘వాహిని’ పత్రికలో 1932లో చేరారు. 1943 నుంచి 1959 వరకూ ఆంధ్రపత్రికలో పనిచేశారు. 1960లో ‘ఆంధ్రభూమి’ వ్యవస్థాపక సంపాదకులుగా విశేషమైన సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ఆధ్వర్యంలో వెలువడిన ‘ఆంధ్ర జనత’కు 1965లో ఏడాదిపాటు సంపాదకత్వం వహించారు. 1966 నుంచి 1976 వరకూ ‘ఆంధ్రప్రభ’ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. 1969-72 మధ్య కాలంలో రాష్ట్రంలో తలెత్తిన వేర్పాటువాద ఉద్యమ సందర్భాలలో సమన్వయానికి, సంఘటితత్వానికి దోహదం చేయడంలో ప్రముఖపాత్ర నిర్వహించారు. పండిత పాత్రికేయులుగా ప్రఖ్యాతిగాంచిన పండితారాధ్యుల 1976 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు. ఆయన జన్మించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, వయోధిక పాత్రికేయుల సంఘం సంయుక్తంగా మార్చి 26 ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో ‘శతజయంతి’ సమావేశాన్ని ఏర్పాటు చేయటం ముదావహం.
ముదిగొండ వీరభద్ర శాస్త్రి హైదరాబాద్( From Sakshi )
(పండితారాధ్యుల నాగేశ్వరరావు జన్మించి నేటికి శత వసంతాలు)

No comments:

Post a Comment